మహిళ దారుణ హత్య

1 Dec, 2015 10:02 IST|Sakshi

మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళను హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలోని అయ్యోరిపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఆయ్యోరిపల్లికి చెందిన గుజరాతీ రాంభాయ్ (50) అనే మహిళ సంచార జీవనం చేస్తుండేది. సోమవారం అర్ధరాత్రి చంద్రయ్య అనే వ్యక్తితో రాంభాయ్ గొడవపడింది. తాగిన మైకంలో ఉన్న చంద్రయ్య ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు