పత్తిరైతు ఆత్మహత్య

24 Mar, 2016 14:25 IST|Sakshi

 అప్పుల బాధ తాళలేక పత్తిరైతు ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరనెమలిపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీనయ్య(38) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు