చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

1 May, 2015 11:09 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు తమ వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో చౌటుప్పల్ టోల్గేట్ వద్ద వాహనాలు అరకిలో మీటరు వరకు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి.  
 

మరిన్ని వార్తలు