టీఆర్‌ఎస్ కార్యకర్తలకు బీమా: పల్లా

11 Apr, 2015 00:03 IST|Sakshi
టీఆర్‌ఎస్ కార్యకర్తలకు బీమా: పల్లా

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కార్యకర్తలకు రూ.2 లక్షల సాయం అందేలా ఇన్సూరెన్సు చేయించామని ఆ పార్టీ అడహాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4 కోట్ల 64 లక్షల 21 వేల 200 ప్రీమియం సొమ్మును  చెల్లించామని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

థర్డ్‌పార్టీ బీమా కంపెనీ ‘ఈ-మెడ్ లైఫ్’ ప్రతినిధులకు ఈ మొత్తానికి చెక్కును సీఎం కేసీఆర్ అందించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వం నమోదు కాగా, ఇప్పటి వరకు తమ కార్యాలయానికి అన్ని వివరాలతో 41.30 లక్షల మంది సభ్యత్వాలు అందాయని, వీరందరికీ ఇన్సూరెన్సు చేయించామన్నారు. ఈ బీమా ద్వారా సభ్యులకు రూ.2 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు