ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ధర్నా

6 Jun, 2015 11:12 IST|Sakshi

ఆదిలాబాద్ (మందమర్రి): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. తమ గ్రామం ఓపెన్ కాస్ట్ వల్ల నాశనం అవుతుందని, పకృతికి కూడా ఇది ప్రమాదకరమని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. దీక్షకు దిగిన గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆర్డీఓ నస్రత్, డీఎస్పీ రమణా రెడ్డి రంగంలోకి దిగారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు