'చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించండి' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించండి'

Published Sat, Jun 6 2015 11:16 AM

congress mp v hanumantha rao meets rajnath singh over revanth reddy issue

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని ఆయన ఈ సందర్భంగా రాజ్నాథ్కు వినతిపత్రం సమర్పించారు. కాగా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని గవర్నర్ను ఆదేశించామని రాజ్నాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. పారదర్శకంగా విచారణ జరిపిస్తామని రాజ్నాథ్ హామీ ఇచ్చారని వీహెచ్ తెలిపారు.

Advertisement
Advertisement