హైదరాబాద్సిటీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుస జోష్యాలు చెప్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తామే అధికారంలోకి వస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.రాష్ట్రంలో సామాజిక పరిపాలన తెస్తుందన్నారు. మహబూబ్నగర్ జడ్జర్లకు చెందిన పలువురు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి ఉత్తమ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం విలేకరులతో మాట్లడుతూ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, బంగారు తెలంగాణ అని ఎలా అనగలుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిలో, కేసీఆర్ ఫ్యామిలి మాత్రమే సంతోషంగా ఉందని విమర్శించారు. అధికార అహంకారంతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పరిపాలనను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ సర్కార్కు మానవీయత లేదని మండిపడ్దారు.