నిజాం షుగర్స్‌ను రైతులకే ఇస్తాం: కేసీఆర్

6 Jan, 2015 06:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నిజాం చక్కెర ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామని చెరుకు రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం చక్కెర కర్మాగారం పరిరక్షణ సమితికి చెందిన రైతులు సోమవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత నేతృత్వంలో సీఎంను కలిశారు. రైతులే నడుపుకున్నట్లయితే షుగర్ ఫ్యాక్టరీని ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పరిరక్షణ సమితి కన్వీనర్ అప్పిరెడ్డి మీడియాకు తెలిపారు.
 

మరిన్ని వార్తలు