-
కమిటీతోనైనా కథ ముగిసేనా?
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది. ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్గా, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్రెడ్డి, రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్ఎస్ఎల్గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్డీఎస్ఎల్గా పేరు మార్చుకుంది. ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఎస్ఎల్ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు 2015 ఏప్రిల్లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్ అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్డీఎస్ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్సీఎల్టీ లిక్విడేటర్ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు. పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్సీఎల్టీ లిక్విడేషన్కు అనుమతిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్డీఎస్ఎల్పై ఇప్పటికే హౌజ్కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది. -
బాబుకు ‘నిజాం షుగర్స్’ పాపమే కొట్టింది
బోధన్: ‘‘లాభాల్లో నడిచే నిజాం షుగర్స్ను ప్రైవేటీకరించి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నాడు, అలాంటి పరిస్థితి మీకు (ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం) రావాలని కోరుకోవడం లేదు.. ఎన్డీఎస్ఎల్(నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్) లేఆఫ్ నుంచి రావాల్సిన బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించండి’’అని కార్మికులు డిమాండ్ చేశారు. ఒక్కసారిగా బాబు ప్రస్తావన విని ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బరాజు, పర్సనల్ ఆఫీసర్ శ్రీధర్రాజు, స్థానిక అధికారి రమేష్ అవాక్కయ్యారు. ఫ్యాక్టరీ మూసివేత వల్ల తమ జీవితాలు అన్యాయమయ్యాయని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, బిచ్చమెత్తుకుని బతకాల్సిన దుస్థితి వచ్చిందని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల వేతన, ఇతర బకాయిల చెల్లింపునకు సంబంధించి సెటిల్మెంట్ చేసేందుకు ఎన్డీఎస్ఎల్ అధికారులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్ ఫ్యాక్టరీలో సమావేశం నిర్వహించారు. బోధన్, ముత్యంపేట, ముంబోజిపల్లి ఫ్యాక్టరీల కార్మికులు హాజరయ్యా రు. 2015 డిసెంబర్ 23న ప్రైవేట్ యాజమాన్యం బోధన్, ముత్యంపేట(జగిత్యాల), ముంబోజిపల్లి (మెదక్) యూనిట్లను మూసివేసిన విషయం తెలిసిందే. రాతపూర్వక ఒప్పందం మేరకు ఇవ్వండి ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బరాజు చర్చను ప్రారంభిస్తూ 2021లో లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2015 డిసెంబర్ 23 కట్ డేట్ (లేఆఫ్ ప్రకటించిన తేదీ) నిర్ధారించి ఏడాదికి 15 రోజుల చొప్పున కార్మికుడి సర్విసు మేరకు వేతనంతో కూడిన బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదన అసంబద్ధమైందని కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూసివేతకు గురైతే ఏడాదికి 45 రోజుల చొప్పున వేతనం చెల్లించాలని యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఉందని, దీంతో పాటు, లేబర్ కోర్టు తీర్పు ప్రకారం 15 రోజులు కలుపుకుని 60 రోజుల చొప్పున వేతన బకాయిలు ఇవ్వాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాటా 49 శాతం ప్రైవేట్ కంపెనీ వాటా 51 శాతంతో జాయింట్ వెంచర్లో నడుస్తున్నందున చర్చల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉందా? అన్ని ప్రశ్నించారు. చర్చల అనంతరం కార్మికుల డిమాండ్ను ఎండీ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. చర్చల వెనుక ఏదో కుట్ర ఉంది.. చర్చల వెనుక ప్రైవేట్ యాజమాన్యం ఏదో కుట్ర పన్నుతోందని కార్మిక నాయకులు రవి శంకర్గౌడ్, ఉపేందర్, కుమార స్వామిలు ఆరోపించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాన్ని పక్కన బెట్టి ఎన్నికల సమయంలో దొంగ చాటు చర్చలెందుకని ప్రశ్నించారు. మూడు ఫ్యాక్టరీలకు సంబంధించి రూ. 2వేల కోట్ల ఆస్తులు కబళించేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఎల్ను రీ ఓపెనింగ్ చేయలేం.. తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్టరీ టే కోవర్ చేస్తుందని స్పష్టత ఇచ్చినందున రీ ఓపెనింగ్ చేయలేమని ఎన్డీఎస్ఎల్ సీఈవో సుబ్బారావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
తగ్గని షుగర్ ప్రాబ్లం
నిజామాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో తొమ్మిదింటికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మరోసారి ‘కారు’ జోరు కొనసాగించేందుకు మంచి గేరు మీదుంది. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్లకే సీట్లు ఖరారు చేసింది. కాంగ్రెస్ మహాకూటమి పేరుతో రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో పోరు తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అయితే కూటమిలోని పక్షాలు ఏ మేరకు సమన్వయంతో కలిసి పనిచేస్తాయన్నదే సమస్య. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు, ఎర్రజొన్న సాగు అంశాలు, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో నిజాం చక్కెర కర్మాగారం అంశం ప్రభావం చూపనుండగా, నిజామాబాద్ అర్బన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలే ప్రచారాస్త్రాలు కానున్నాయి. టీఆర్ఎస్కు దన్ను.. ‘ఎర్రజొన్న’ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎర్రజొన్న రైతులు ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. వీరికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.9 కోట్లను విడుదల చేయడంతో పాటు, రైతుల నుంచి ఆ పంట మొత్తాన్ని కొనేలా ప్రభుత్వం తీసుకున్న చొరవను అనుకూలంగా మలుచుకుని టీఆర్ఎస్ విస్తృత ప్రయోజనం పొందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎర్రజొన్నల కొనుగోలు వ్యవహారంలో జరిగిన కాల్పుల ఘటనను టీఆర్ఎస్.. ఇప్పటికీ తాజాగానే ఉంచుతోంది. బకాయిల చెల్లింపు విషయంలో మాట నిలుపుకున్న విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనాలని రైతులు రోడ్డెక్కడంతో.. జిల్లా ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఒప్పించి ఎర్రజొన్న మొత్తాన్ని కొనేలా చేశారు. దీంతో రైతులు సంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వాణిజ్య పంట అయిన ఎర్రజొన్నలను కొనుగోలు చేసి రైతులను ఏటా మోసం చేస్తున్న సీడ్ వ్యాపారులకు చెక్ పెట్టడం 40 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమని రైతులు, రైతు నాయకులు అంటున్నారు. కేంద్రం వల్లే పసుపు బోర్డు ఆగిందని.. జిల్లాలో పసుపు ఎక్కువగా పండించే రైతులు అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తామని టీఆర్ఎస్ హామీనిచ్చింది. నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా.. సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. రాందేవ్ బాబాను కలిసి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కోసం కృషి చేశారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడిపెట్టి పసుపు సాగుచేస్తే.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక, ధర సరిగా రాక రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ పసుపుబోర్డు ఏర్పాటైతే మార్కెటింగ్ సౌకర్యం మెరుగు పడుతుంది. కానీ కేంద్రం తీరు వల్ల రైతులకు మేలు జరగడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గల్ఫ్..బీడీ.. వగైరా - తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాలకు కార్మికులు వలస వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్ఎస్.. ఎన్ని కల సందర్భంగా గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని హామీనిచ్చింది. 2018–19 బడ్జెట్లో ఎన్ఆర్ఐ సెల్కు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు ఏకంగా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి కార్మికుల స్థితిగతులను పరిశీలించమే కాక, రూ.500 కోట్లతో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటుకు హామీనిచ్చారు. - జిల్లాలో బీడీ కార్మికులు లక్షన్నర వరకు ఉంటారు. వీరికి కనీస వేతనాలు లేవు. నెలలో పనిదినాలూ తక్కువే. ఈ అంశంపై ఏ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. - డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని విపక్షాలు దుమ్మెత్తిపోయనున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలను ప్రతిపక్షం ఎక్కుపెట్టనుంది. - పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీని నింపడానికి ప్రభుత్వం చేపట్టిన పథకంతో.. జిల్లా రైతాంగానికి సాగునీటికి ఢోకా ఉండదని అధికార పక్షం చెబుతోంది. రైతుబంధు, బీమా పథకాలతోపాటు వివిధ వర్గాలకు ఇస్తున్న పెన్షన్లు, పథకాలను అధికార పక్షం ప్రచారం చేసుకోనుంది. టీఆర్ఎస్ ఇలా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన ప్రధాన హామీ.. నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపించ డం. ప్రభుత్వ సంస్థగా కాక, రైతులు సహకార సంస్థగా ఏర్పాటు చేసుకుని నడిపించుకుంటే చేదోడుగా నిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు రైతులు అంగీకరించక.. ప్రభుత్వమే నడిపించాలని పట్టుబట్టారు. అనంతరం ఫ్యాక్టరీ స్వాధీనం, భవిష్యత్తు నిర్వహణపై ప్రభుత్వం అధ్యయన కమిటీని వేసింది. నివేదిక రాలేదు. ఈలోపు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఏళ్లుగా కర్మాగారాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు, చెరకు ప్రధాన పంటగా సాగు చేస్తున్న రైతులు ఫ్యాక్టరీ మూతతో రోడ్డునపడ్డారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి. కాంగ్రెస్ అలా.. నిజాం షుగర్స్ను ప్రభుత్వ రంగ సంస్థగా ఎందుకు మార్చలేదంటూ టీఆర్ఎస్ను నిలదీయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. చంద్రబాబు హయాంలో జాయింట్ వెంచర్ పేరుతో ఈ కర్మాగారంపై పెత్తనాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించా రు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో.. 2004లో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి శాసనసభ కమిటీని వేశారు. కానీ, కమిటీ సిఫారసు అమలు కాలేదు. కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. పరిశ్రమను ప్రైవేట్పరం చేయడానికి యత్నించగా, రైతులు, కార్మికులు స్టే తెచ్చుకున్నారు. ఆ తరుణంలోనే టీఆర్ఎస్.. తాము అధికారంలోకి వస్తే కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందని పేర్కొంది. దీన్నే కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. ..::కె.శ్రీకాంత్రావు -
‘నిజాం షుగర్స్ను కాపాడుకుందాం’
బోధన్ : తెలంగాణ వారసత్వ సంపద నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్)ని కలిసికట్టుగా కాపాడుకుందామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపు నిచ్చారు. నిజాంషుగర్స్ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలన్న ప్రధాన డిమాండ్తో టీ జేఏసీ, నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం బోధన్లో ధర్నా, పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ ఒక వైపు అసెంబ్లీలో వారసత్వ కట్టడాల రక్షణకు బిల్లు ఆమోదం తెలుపుతూనే మరో వైపు వారసత్వ సంపద నిజాంషుగర్ ఫ్యాక్టరీ నాశనమవుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం విచిత్రమైన పరిస్థితి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా రైతులు ముందుకువస్తే అప్పగిస్తామని ప్రకటన చేసిన ప్రభుత్వం నెలలు గడిచిపోతున్నా విధివిధానాలు ప్రకటించకుండా జాప్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 4వేల ఎరువు సహాయం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలన్నారు. -
నిజాం షుగర్స్ను ప్రభుత్వమే నడపాలి
♦ అదే ఉద్యమ కాలం నాటి ఆకాంక్ష ♦ రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ♦ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బోధన్: నిజాంషుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావడం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో నిజాంషుగర్స్ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ఉద్యమం చేపట్టామన్నారు. నిజాంషుగర్స్ను తెరిపించి, ప్రభుత్వమే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి తాత్కాలికంగా ఫ్యాక్టరీని మూసి వేసిన నేపథ్యంలో చెరుకు పంట సాగు, రైతుల స్థితిగతులు, పంట సాగు, ఫ్యాక్టరీ భవిష్యత్తుపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం కోదండరాం గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో ప్రొఫెసర్ పర్యటించారు. మందర్న, హున్సాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్స్ను ప్రైవేటీకరించడం తప్పిదమని, స్వరాష్ట్రంలో ఫ్యాక్టరీ మూసివేయడం మరో తప్పిదమవుతోందన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్టరీ రక్షణ కోసం జిల్లా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. బంగారు తెలంగాణ స్వప్నం బంజారాహిల్స్కే పరిమితం కావొద్దని, యావత్ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలన్నారు. రైతులు, కార్మికుల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సదస్సులు, సమావేశాలు నిర్వహించి త్వరలోనే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తలపెడుతామన్నారు. పార్టీల కతీతంగా రైతులు సంఘటితం కావాలన్నారు. ఎడ్లబండి ఎక్కిన తర్వాత పగ్గాలు చేత పట్టాలే కాని భయపడితే ఎలా అని రైతులను నుద్దేశించి అన్నారు. పార్టీలకతీతంగా బతుకు జెండా ఎత్తాలన్నారు. నిజాంషుగర్స్ను తిరిగి తెరిపించాలని కోరడం న్యాయబద్ధమైందని, ఇదే తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు. న్యాయం, ధర్మం కోసమే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నడిచిందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement