ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం

13 Feb, 2015 16:16 IST|Sakshi

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సమీప అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు శవమై కనిపించాడు. భీమ్‌గల్‌కు చెందిన అడపా భూమన్న (41) ఆరు నెలల క్రితం అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం మెండర గ్రామ సమీపంలోని షీర్ల గుట్టపై ఓ చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అస్థిపంజరం భూమన్నదిగా గుర్తించారు. చాలా రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల చివరికి అస్తిపంజరం మిగిలినట్లు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు