మెదక్‌ జిల్లాలో విషాదం

14 Nov, 2017 12:51 IST|Sakshi

విద్యుత్‌షాక్‌తో మహిళా రైతుల మృతి

సాక్షి, మెదక్: మెదక్‌ జిల్లాలో రామాయంపేట్ మండలం విషాదం చోటు చేసుకుంది. కాట్రీయల్ గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళా రైతులు  మృతి చెందారు. మహిళా రైతుల పొలానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

అదే విధంగా వరంగల్ అర్బన్ జిల్లా కొత్తపేటలో రాసమల్ల రాజేందర్(45) అనే రైతు పంట చేను వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు