ఇద్దరు చిన్నారులను బావిలో పారేసిన తండ్రి

10 Dec, 2013 19:58 IST|Sakshi

ప్రకాశం: జిల్లాలోని పొదిలి మండలం కంబాలపాడులో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. పోషణ చూడాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు చిన్నారులపాలిట కాలయముడైయ్యాడు.  ఆ పిల్లలిద్దరినీ బావిలో పడేసిన ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

భార్యభర్తలు గొడవల కారణంగానే తన పిల్లలను చంపినట్టు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు