రక్తదానానికి గిన్నిస్ రికార్డు

18 Feb, 2014 06:05 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. ఈ నెల 24న జయలలిత 66వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భం గా తమిళనాడు రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నేతృత్వంలో ఈ నెల 14న చెన్నై సహా 10 ప్రాంతాల్లో ఏక కాలంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటిలో 58,129 మంది రక్తదానం చేశారు. గతంలో హర్యానాలో జరిగిన వైద్య శిబిరంలో 40 వేల మంది రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును తమిళనాడులో నిర్వహించిన రక్తదాన శిబిరం తిరగ రాసింది. గిన్నిస్ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సోమవారం తమిళనాడు సీఎం జయలలితకు ఆ సంస్థ ప్రతినిధి లూసియూ అందజేశారు.

మరిన్ని వార్తలు