పట్టపగలే సినీ ఫక్కీలో రూ. 6 కోట్ల దోపిడీ

28 Jan, 2014 16:04 IST|Sakshi

న్యూఢిల్లీ: పట్టపగలే సినీ ఫక్కీలో భారీ నగదును దోచుకెళ్లిన ఘటన దక్షిణ ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఆర్మీకి చెందిన వ్యకి కొంతమంది తో ముఠాగా ఏర్పడి రూ. 6 కోట్లను దోచుకుపోయాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా వ్యాపారవేత్త తన వద్ద ఉన్న రూ.ఆరు కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కారులో వెళుతున్న సమయంలో ఈ చోరీ జరిగింది. మంగళవారం ఉదయం 9గం.ల కు లజ్పత్ నగర్ మెట్రో స్టేషన్ ప్రాంతానికి సమీపంలో చేతిలో ట్రైన్డ్ గన్స్ కల్గిన వ్యక్తి ఆ వ్యాపారవేత్తను అడ్డగించి బెదిరించసాగాడు.

 

అతనికి జతకలిసిన మరికొంతమంది దుండగులు వ్యాపారవేత్తను బెదిరించి కారుతో ఉడాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దుండగులను పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు