న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ సేల్స్ లోకి మరోసారి డిస్కౌంట్ అమ్మకాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రిపబ్లిక్ డే సేల్ పేరుతో మూడు రోజులు తగ్గింపు ధరల అమ్మకాలకు తెరలేపింది. ముఖ్యంగా పలు స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లను అందించనుంది. రేపటినుంచి జనవరి 24 నుంచి 26 మధ్య ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్, లెనోవా, సోనీ, రెడ్ మీ లాంటిస్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ధరలను , ఆకర్షణీమైన ఎక్సేంజ్ ఆఫర్లను ప్రకటించింది. వీటితో పాటు టీవీలు, గృహోపకరణాలు , కిచెన్ అప్లయన్సెస్ , దుస్తులు, స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కైంట్ ధరలను అందించనుంది. అంతేకాదు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే ఏప్రిల్ 30 తరువాత ఈ క్యాష్ క్రెడిట్ అవుతందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
శామ్సంగ్ గెలాక్సీ (గోల్డ్, 32 జీబీ ) డిస్కౌంట్ ధర రూ. 16, 900 అసలు ధర రూ 18, 490
లెనోవా వైబ్ కే 5 నోట్ (గ్రే 32 జీబీ ) తో 4జీబీ ర్యాం రూ 11,499 అసలు ధరరూ 13, 499
శామ్సంగ్ గెలాక్సీ On8 (బంగారు 16 జీబీ డిస్కౌంట్ ధర రూ 14, 900 అసలు ధర రూ 15,900
నెక్సస్ 6సీ స్పెషల్ ఎడిషన్ (గోల్డ్ 64 జీబీ) డిస్కౌంట్ ధర రూ 35, 998 అసలు ధర రూ 42, 998
ఎంఐ 5 (వైట్, 32 జీబీ) తగ్గింపు ధర రూ 22, 999 అసలు ధర రూ 24, 999
మరిన్ని ఆఫర్ల వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ లో గమనించగలరు.