విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో కేటీఆర్ భేటీ

6 Nov, 2015 19:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ .. విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం కేటీఆర్.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కలిశారు. గల్ఫ్ లో తెలంగాణ వాసుల కష్టాల గురించి చర్చించారు.

గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నవారికి క్షమాభిక్ష ప్రసాదించి, వారు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి వివరాలతో ఒక డేటాబేస్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు