ఆటో బోల్తా : ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఒకరు మృతి

Published Fri, Nov 6 2015 7:08 PM

One dies as auto overturns

పుట్లూరు : అనంతపురం జిల్లా పుట్లూరు మండలం జంగంరెడ్డిపేట - మద్దిపల్లి మార్గ మధ్యంలో ప్రయాణికుల ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆటో జంగంరెడ్డిపేట నుంచి మద్దిపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరాయుడు (45)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం నార్పల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement