గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత

30 Oct, 2014 11:04 IST|Sakshi
గాజాలోని స్కూళ్లకు మలాలా చేయూత

లండన్: గాజాలోని దెబ్బతిన్న స్కూళ్లకు పాక్ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ చేయూతనందించారు. గత కొన్ని రోజుల క్రితం ప్రపంచ బాలల నోబెల్ అవార్డుకు (వరల్డ్ చిల్ట్రన్స్ ప్రైజ్)ఎంపికైన మలాలా.. ఆ బహుమతి ద్వారా వచ్చిన 50 వేల యూస్ డాలర్లను అక్కడి స్కూళ్లను పునరుద్ధరించేందుకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో గాజాలో స్కూళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. బహుమతి కింది అందే  మొత్తాన్ని ఆమె బాలల సంక్షేమం కోసం వినియోగించాల్సి ఉన్నందున ఆమె గాజాలో స్కూళ్లకు విరాళంగా అందజేశారు.

 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నాణ్యమైన విద్యకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్కడ విద్య లేకుంటే ఎప్పటికీ శాంతి అనేది ఉండదు' అని పేర్కొంది.

 

మరిన్ని వార్తలు