ట్రాక్ పేల్చిన మావోలు: రైళ్ల రాకపోకలకు అంతరాయం

23 Jul, 2014 08:40 IST|Sakshi

బీహార్: బీహార్లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు. గత అర్థరాత్రి గయా వద్ద రైల్వే ట్రాక్ను పేల్చివేశారు. దాంతో హౌరా - ఢిల్లీ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రైల్వే ట్రాక్ను పునరుద్దరించేందుకు ఆ శాఖ అధికారులు యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టారు. మావోయిస్టు కీలకనేతలలో ఒకరైన సవ్యసాచి పండాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు