ఆ ఘటన అవమానకరం.. సీఎం సీరియస్

9 Mar, 2017 15:25 IST|Sakshi
ఆ ఘటన అవమానకరం.. సీఎం సీరియస్

తిరువనంతపురం: మోరల్ పోలీసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం నాడు కొచ్చి బీచ్ లో జరిగిన మోరల్ పోలీసింగ్ ఘటనను ఆయన ఖండించారు. ఇది అవమానకర ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

కొచ్చి బీచ్ లో బుధవారం పలు యువ జంటలపై శివసేన కార్యకర్తలు దాడులు చేశారు. పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమికొట్టారు. ఈ ఘటనపై ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక వార్త ఇక్కడ చదవండి:
‘ఉమెన్స్‌ డే’ జంటలను పరుగెత్తించి కొట్టారు

మరిన్ని వార్తలు