'వాత్సల్యం, విధేయత మార్కెట్ లో దొరకవు'

9 Jan, 2015 19:40 IST|Sakshi
'వాత్సల్యం, విధేయత మార్కెట్ లో దొరకవు'

న్యూఢిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. బాధ్యతారహితంగా మత,  రాజకీయ సంబంధ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నాయకులు ఆచితూచి మాట్లాడాలని సూచించారు.

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ, సాక్షి మహరాజ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి తదితర నాయకులకు ప్రధాని, ముఖ్యమంత్రులు ముకుతాడు వేయాలని ట్విటర్ లో పేర్కొన్నారు. వాత్సల్యం, విధేయత అనేవి మార్కెట్ లో దొరికే వస్తువులు కాదంటూ దిగ్విజయ్ సింగ్ మరో ట్వీట్ చేశారు.
 

మరిన్ని వార్తలు