హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం

21 Jul, 2017 00:47 IST|Sakshi

బస్సు లోయలో పడి 28 మంది దుర్మరణం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు గురువారం హిందుస్తాన్‌–టిబెట్‌ జాతీయ రహదారిలో రాంపూర్‌లోని ఖనేరి వద్ద 500 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది మృతిచెందగా, మిగతా 8 మందికి గాయాల య్యాయి. బస్సు కిన్నౌర్‌లోని రెకాంగ్‌ పియో నుంచి సోలన్‌లోని నౌని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంఘటనా స్థలం సిమ్లాకు సుమారు 140 కి.మీ దూరంలో ఉంది. ప్రమాదానికి కారణం కనుగొనేం దుకు రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియ ల్‌ విచారణకు ఆదేశించింది. బస్సు టైరు పేలిపోవడం వల్లే అది లోయలో పడిపోయి నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 28 మంది మృతదేహాలను వెలికితీశారు. అందులో 11 మందిని గుర్తించారు.

మరిన్ని వార్తలు