రియాద్:సౌదీ అరేబియాలో గురువారం ఓ మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది మృతిచెందారు. వీరిలో 10 మంది పోలీసులు, ముగ్గురు మసీదు కార్మికులున్నారు. అసిర్ రాజధాని అభాలో ఉన్న మసీదులో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో 17 మంది పోలీసులు మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినా.. మొత్తం గా13 మంది మృత్యువాత పడినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. గత మే నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే సౌదీలో ఇది మూడో ఆత్మాహుతి దాడి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.