జైపూర్లో కుప్పకూలిన భవంతి : ఇద్దరు మృతి

10 Aug, 2013 13:05 IST|Sakshi

జైపూర్ నగరంలో భట్టా బస్తీలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారని పోలీసు ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని నగరంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. భవన  శిధిలాలను తొలగించేందుకు చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు.


అయితే భవన శిధిలాల కింద చికుక్కున్న ఆ నలుగురిలో ఓ చిన్నారి కూడా ఉందని పేర్కొన్నారు. వారందరిని శిధిలాల కింద నుంచి వెలుపలకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్పొరేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. అయితే నాలుగంతస్థుల భవంతిపై భాగంలో నిర్మాణం జరగుతుందని, ఆ నేపథ్యంలో భవంతి కూలి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు