'టీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటాం'

20 Sep, 2016 12:32 IST|Sakshi
'టీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటాం'

హైదరాబాద్ : పార్టీ మారాలంటూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను టీఆర్ఎస్ నేతలు చిత్రవధ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... సర్పంచ్ల అధికారాలు తగ్గిస్తూ జాయింట్ చెక్పవర్ ఇవ్వడం అన్యాయమన్నారు.

కేంద్రం ఇచ్చిన రూ. 90 వేల కోట్లను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొన్నారా ? అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషానే ప్రశ్నించారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. వాటర్ గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కమీషన్ల కక్కుర్తి కోసమే... రైతులు, విద్యార్థుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు లేవంటుందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు నెల నెలా నిధులు చెల్లిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.

మరిన్ని వార్తలు