న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్సభ సభ్యులకు విప్ జారీ చేశారు. కాంగ్రెస్ ఎంపిలు వారం రోజులపాటు సభకు విధిగా హాజరుకావాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని మూడు లైన్లు ఉన్న ఆ విప్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై రేపు లోక్సభలో చర్చ జరుగుతుంది. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రేపు లోక్సభలో మాట్లాడే అవకాశం ఉంది.