డంపింగ్‌ యార్డు వద్ద మరొకరు..

22 Mar, 2023 02:28 IST|Sakshi
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

రోలుగుంట : కుసుర్లపూడి గ్రామం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ బి.నాగకార్తీక్‌ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాలివి. సుమారు పది రోజులుగా ఈ వ్యక్తి కుసుర్లపూడి గ్రామంలో తిరుగుతూ ఎవరైనా పెట్టింది తిని గ్రామంలోనే ఉంటున్నాడు. ఎవరైనా ఆడిగితే తనది మాడుగుల అని చెప్పడం మినహా కచ్చిత సమాచారం లేదు. అతను మంగళవారం గ్రామానికి చెందిన డంపింగ్‌ యార్డు వద్ద మృతిచెంది పడి ఉన్నాడు. దీంతో మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తరలించి మార్చురిలో భద్రపరిచినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఫోన్‌ నంబర్లు 949061945, 9440796080లకు సమాచారం తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు