టీడీపీకి గిరి కుటుంబాల షాక్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీకి గిరి కుటుంబాల షాక్‌

Published Sun, Nov 19 2023 1:48 AM

బొర్రచింతకు చెందిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న డిప్యూటీ సీఎం బూడి  - Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన 9 కుటుంబాలు

దేవరాపల్లి: మండలంలో వాలాబు పంచాయతీ శివారు బొర్రచింతకు చెందిన తొమ్మిది కుటుంబాల వారు టీడీపీకి షాక్‌ ఇచ్చారు. శనివారం తారువ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సుకూరు గణేశ్‌, ఎరకన్నదొర, వోలం దేవరాజు, మామిడి మల్లేష్‌, జగదీష్‌, భీమరాజు, లక్ష్మణరావు, దిప్పాల పోతురాజు, దేముడు ఉన్నారు. తామంతా డిప్యూటీ సీఎం నాయకత్వంలో పనిచేస్తూ.. భవిష్యత్తుకు బాటలు వేస్తున్న వైఎస్సార్‌సీపీ అడుగు జాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు బూరె బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, యువజన విభాగం మండలాధ్యక్షుడు కర్రి సూరినాయుడు, వాలాబు నాయకుడు పోడెల నానిబాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement