కశింకోట: రాష్ట్ర స్థాయి కత్తి సాము పోటీల్లో కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థి తన ప్రతిభను ప్రదర్శించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నాడు. స్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు నంద్యాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కత్తి సాము పోటీలో అండర్ – 17 విభాగంలో కాంస్య పతకం, ప్రశంసా పత్రాలను పొందాడు. ఈ సందర్భంగా స్కూలు పీడీ వి. ప్రభాకరరావు, విద్యా కమిటీ చైర్మన్ మేరీ సుజాత, ఉపాధ్యాయులు రామారావు, అప్పారావు, శర్మ, ఆచంట రవి, ప్రసాద్, సునీత తదితరులు శనివారం అభినందించారు.