రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Wed, Mar 22 2023 2:28 AM

కశింకోట వద్ద మృతి చెందినగుర్తు తెలియని వ్యక్తి  - Sakshi

కశింకోట : కశింకోట రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతి చెందినట్టు దువ్వాడ రైల్వే ఎస్‌ఐ శాంతారాం తెలిపారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న మార్గంలో కశింకోట రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని వెళ్లిపోవడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. మృతుడు తెలుపు, నీలం రంగు గీతల ఫుల్‌ హేండ్‌ షర్టు, లుంగీ, ఆర్మీ యూనిఫారం హాఫ్‌ నిక్కరు ధరించి ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, బంధువులు ఉంటే తమను గాని, రైల్వే పోలీసుస్టేషన్‌లో గాని 7673906010 నంబర్లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement