కొబ్బరిచెట్టుపై నుంచి పడి రైతు మృతి | Sakshi
Sakshi News home page

కొబ్బరిచెట్టుపై నుంచి పడి రైతు మృతి

Published Sun, Nov 19 2023 1:48 AM

మృతుడు రాజారావు  - Sakshi

కశింకోట: మండలంలో అచ్చెర్ల గ్రామం కొబ్బరిచెట్టుపై నుంచి కిందపడి రైతు మృతి చెందినట్లు ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి శనివారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. అచ్చెర్ల గ్రామానికి చెందిన నిమ్మదల రాజారావు(58) తన పొలంలో కొబ్బరిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడ్ని కుటుంబ సభ్యులు అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు కుమారుడు రమేష్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement