విజయవాడ నుంచి ఢిల్లీకి ‘అమృత్‌ కలశ్‌’ ప్రత్యేక రైలు

29 Oct, 2023 05:23 IST|Sakshi

1.5 కి.మీ.జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ 

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): నా భూమి.. నా దేశం ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్‌ కలశ్‌యాత్ర ప్రత్యేక రైలు బయలు దేరింది. పశ్చి­మ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యక్ష్మి, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్, డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ జెండా ఊపి రైలును సాగనంపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న అజాది కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూ­మి.. నా దేశం’ పేరుతో అక్టోబర్‌ 30, 31 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలో­ని 26 జిల్లాల నుంచి 1,100 మంది వలంటీర్లు 824 కలశాలతో రైలులో బయలు దేరా­రు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థు­లు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1.5. కి.మీ. పొడ­వు జాతీ­­య జెండాతో భారత్‌ మాతాకు జై.. అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు