సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్తో ఈ సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు సీఎం జగన్ దంపతులు గవర్నర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు.. కోవిడ్ కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న విషయం విధితమే.