ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ సవాంగ్‌

24 Feb, 2022 11:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్‌ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు.

చదవండి: (ఆర్‌బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..) 

మరిన్ని వార్తలు