తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి

15 Sep, 2023 00:53 IST|Sakshi

వాహన డీలర్లకు కేంద్ర మంత్రి గడ్కరీ సూచన 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్‌ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్‌ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్‌ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ ఉందని అయిదో ఆటో రిటైల్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్‌ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్‌ ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు