బీఎండబ్ల్యూ సి–400 జీటీ స్కూటర్‌

13 Oct, 2021 10:57 IST|Sakshi

ద్విచక్ర వాహన రంగంలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్‌ భారత్‌లో  సి–400 జీటీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.95 లక్షలు. పూర్తిగా తయారైన స్కూటర్‌ను కంపెనీ భారత్‌కు దిగుమతి చేస్తోంది. బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. 

నగరంతోపాటు సుదూర ప్రాంతాలనూ ఈ స్కూటర్‌పై సులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 34 హెచ్‌పీ పవర్‌తో వాటర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఫోర్‌ స్ట్రోక్‌ 350 సీసీ ఇంజన్‌ను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. గంటకు 139 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
 

చదవండి : పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్‌ కార్లపై భారీగా డిస్కౌంట్

మరిన్ని వార్తలు