-
బీఎండబ్ల్యూ, టాటా టెక్ జత
న్యూఢిల్లీ: ఆటో రంగ జర్మన్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్, దేశీ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్విసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ చేతులు కలపనున్నాయి. తద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిసహా.. దేశీయంగా ఐటీ డెవలప్మెంట్ హబ్కు తెరతీయనున్నట్లు సంయుక్తంగా వెల్లడించాయి. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశాయి. ప్రణాళికల్లో భాగంగా పుణే, బెంగళూరు, చెన్నైలలో ఐటీ అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, పుణేలలో ప్రధాన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. చెన్నైలో ఐటీ సొల్యూషన్ల బిజినెస్పై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నాయి. అధీకృత సంస్థల అనుమతుల ఆధారంగా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి. జేవీతో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ను అందించనున్నాయి. ఎస్డీవీ సొల్యూషన్లు జేవీ ప్రధానంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ప్రీమియం వాహనాలకు సాఫ్ట్వేర్ ఆధారిత వాహన(ఎస్డీవీ) సొల్యూషన్లు సమకూర్చనుంది. అంతేకాకుండా ఐటీ బిజినెస్కు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్లు సైతం అందించనుంది. సుమారు 100 ఇన్నోవేటర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంయుక్త ప్రకటనలో బీఎండబ్ల్యూ, టాటా టెక్ వెల్లడించాయి. రానున్న కాలంలో వీలైనంత త్వరాగా ఈ సంఖ్యను నాలుగంకెలకు పెంచనున్నట్లు తెలియజేశాయి. సాఫ్ట్వేర్, ఐటీ కేంద్రాల బీఎండబ్ల్యూ గ్లోబల్ నెట్వర్క్లో జేవీ భాగంకానున్నట్లు పేర్కొన్నాయి. బీఎండబ్ల్యూ గ్రూప్తో చేతులు కలపడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజ నీరింగ్లో కస్టమర్లకు అత్యున్నత సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నట్లు టాటా టెక్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. టాటా టెక్తో భాగస్వామ్యం ఎస్డీవీ విభాగంలో పురోగతికి సహకరించనున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ తెలియజేశారు. -
బీఎండబ్ల్యూ దూకుడు..! భారత్లో తొలిసారిగా..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత్లో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఎన్నడూలేని విధంగా 2021లో రికార్డుస్థాయిలో వాహనాల అమ్మకాలను జరిపినట్లు బీఎండబ్ల్యూ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీగా పెరిగిన అమ్మకాలు..! 2021 భారత్లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. మినీ కూపర్స్ కూడా అధికమే..! బీఎండబ్ల్యూ వాహనాల్లో మినీ కూపర్స్ కూడా భారత్లో అత్యధిక ఆదరణను నోచుకున్నాయి. 2021లో 640 యూనిట్ల మినీ కూపర్ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5 వాహనాలు భారీగా అమ్ముడైనాయి. వీటితో పాటుగా బీఎండబ్ల్యూ ఎమ్ 340ఐ ఎక్స్డిజైర్, బీఎండబ్ల్యూ ఎక్స్7, బీఎండబ్ల్యూ 3 సిరీస్ వాహనాల కోసం కొనుగోలుదారులు నెలల తరబడి వేచి ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు.. కి.మీ రేంజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
టీవీఎస్ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్.. తమిళనాడులోని హొసూర్ ప్లాంటులో ఒక లక్ష బీఎండబ్ల్యూ మోటరాడ్ 310 సీసీ బైక్స్ను ఉత్పత్తి చేసింది. అయిదేళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటరాడ్స్ బైక్స్ ఉత్పత్తిలో హొసూర్ ప్లాంటు వాటా 10 శాతం ఉంది. 2013లో ఇరు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్ కోసం 500 సీసీ లోపు సామర్థ్యంగల బైక్స్ అభివృద్ధి, తయారీని టీవీఎస్ చేపట్టింది. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ జి310 ఆర్, 310 జీఎస్, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్స్ను ఇరు సంస్థలు పరిచయం చేశాయి. ఈ మూడు బైక్స్ కూడా హొసూర్లో తయారవుతున్నాయి. బీఎండబ్లు్య జి310 ఆర్, 310 జీఎస్ మోడళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో లభ్యమవుతున్నాయి. -
బీఎండబ్ల్యూ సి–400 జీటీ స్కూటర్
ద్విచక్ర వాహన రంగంలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ మోటరాడ్ భారత్లో సి–400 జీటీ స్కూటర్ను ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.9.95 లక్షలు. పూర్తిగా తయారైన స్కూటర్ను కంపెనీ భారత్కు దిగుమతి చేస్తోంది. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. నగరంతోపాటు సుదూర ప్రాంతాలనూ ఈ స్కూటర్పై సులభంగా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 34 హెచ్పీ పవర్తో వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 350 సీసీ ఇంజన్ను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9.5 సెకన్లలో అందుకుంటుంది. గంటకు 139 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. చదవండి : పండుగ స్పెషల్ ఆఫర్.. డాట్సన్ కార్లపై భారీగా డిస్కౌంట్ -
నంబర్ చెప్పను.. కానీ ముందుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: తమ వాహనాల విక్రయాల్లో భారత మార్కెట్ లో ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధి సాధిస్తామని లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా విశ్వాసం వ్యక్తం చేశారు. లగ్జరీ కార్ల మార్కెట్ లో వినియోగదారులకు కొత్త విలువను అందించేడమే తమ లక్ష్యమని చెప్పారు. భారత్ మార్కెట్లో తమకు తెలుగు రాష్ట్రాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. డిమాండ్కు అనుగుణంగా కొత్త మోడల్స్ ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. స్పోర్ట్స్ వినియోగ వాహనం(ఎస్ వీయూ) ఎక్స్ 3 మోడల్ లో రెండు కొత్త వెర్షన్లను ఆయన గురువారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఢిల్లీ గురుగ్రామ్లో కొత్తగా ప్రారంభించిన బిఎండబ్ల్యూ 45వ షోరూమ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విక్రమ్ పావాతో 'సాక్షి' ప్రతినిధితో జరిపిన ఇంటర్వ్యూ.. భారత్ లగ్జరీ కార్ల మార్కెట్లో బీఎండబ్ల్యూ ఎదుగుదల ఏవిధంగా ఉంది? 2007లో మేము భారత లగ్జరీ మార్కెట్ లోకి అడుగుపెట్టాం. అప్పటికి విలాస కార్ల అమ్మకాలు కేవలం 2 వేల యూనిట్లు మాత్రమే. ప్రస్తుతం ఈ సంఖ్య 37 వేలకు చేరింది. అగ్రదేశాల మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్ తో పోల్చుకుంటే ఇండియాలో ఇప్పటికీ లగ్జరీ కార్ల మార్కెట్ 1.2 నుంచి 1.4 శాతమే ఉంది. చైనాలో 10 శాతం, జర్మనీలో 28 శాతం వరకు విలాసవంతమైన కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. భారత్ లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు రెడీగా ఉన్నాం. గతేడాది మీ అమ్మకాల్లో 24 శాతం వృద్ది సాధించమన్నారు. ఈ సంవత్సరంలో ఎంత వృద్ధి నమోదవుతుంది ఆశిస్తున్నారు? నంబర్ కచ్చితంగా చెప్పలేను. గతేడాది కంటే అమ్మకాలు మెరుగవుతాయి. నిరుడి కంటే ఎక్కువ శాతం వృద్ధి నమోదు చేస్తాం. మార్కెట్లో మా వాటాను మరింత మెరుగుపరుచుకోవడంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మార్కెట్ గమనం ఎలా ఉంటుందనేది ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ప్రకటించే హమీలు మార్కెట్ పై ప్రభావం చూపుతాయి. గతంలో లగ్జరీ కార్ల మార్కెట్ లో బీఎండబ్ల్యూ నంబర్వన్లో ఉండేది. మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటారా? నంబర్వన్ కంటే కూడా మార్కెట్లో ఎదగడం ముఖ్యం. అగ్రస్థానంలో కొనసాగడమనేది గొప్ప విషయం. అమ్మకాల్లో వృద్ది స్థిరంగా ఉంటే నంబర్వన్ అవుతాం. మా అమ్మకాలు మరింతగా పెంచుకుని నంబర్వన్ అవుతామన్న నమ్మకం ఉంది. ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవాలన్నదే మా ప్రధాన లక్ష్యం. వినియోగదారులకు కొత్త విలువ(న్యూ వాల్యు) అందించేందుకు నిరంతరంప్రయత్నిస్తున్నాం. చిన్న పట్టణాల్లో మార్కెట్ విస్తరణపై ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు? లగ్జరీ కార్ల అమ్మకాలు చిన్న పట్టణాల్లోనూ ఆశాజనకంగా ఉన్నాయి. మెట్రో నగరాలతో పాటు పోలిస్తే అమ్మకాలు తక్కువగా జరుతున్నప్పటీకీ ఇక్కడ మార్కెట్ ను విస్తరించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు కూడా విలాసవంతమైన కార్లను కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. గతేడాది మధురై షోరూమ్ ప్రారంభించినప్పడు మంచి స్పందన వచ్చింది. అంతకుముందు ఔరంగాబాద్లో షోరూమ్ ఏర్పాటు చేశాం. వచ్చే ఏడాది మార్చినాటికి 50 షోరూమ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. భారత మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టే ఉద్దేశం ఉందా? ప్రపంచ మార్కెట్ లో మేము ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాము. అయితే భారత మార్కెట్ లో వీటిని ప్రవేశపెట్టడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం సదుపాయాలు కల్పించి, రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఇక్కడ విక్రయిస్తాం. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వీటి నిర్వహణ, చార్జింగ్ ధరలు మొదలైన అంశాలపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ రూపొందిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్లో ప్రవేశపెట్టడానికి వీలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆ రంగంలో అనుభవం లేదు కాబట్టి ఇందులో మేము భాగస్వాములం కాలేము. ఈ సంవత్సరంలో ఎన్ని మోడల్స్ ప్రవేశపెట్టబోతున్నారు? నంబరు చెప్పలేను. ఎన్ని మోడల్స్ వస్తాయనేది కస్టమర్ల డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. మా కార్లను కొనేందుకు వినియోగదారులు ఎంత ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తే అన్ని కొత్త మోడల్స్ వస్తాయి. ఆటో ఎక్స్పోలో ఏడు మోడల్స్ ప్రదర్శించాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్స్ 3 పెట్రోల్ వేరియంట్ను మార్కెట్ లోకి విడుదల చేస్తాం. తాజాగా ప్రవేశపెట్టిన డీజిల్ వెరియంట్స్లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాం. లేటెస్ట్ టెక్నాలజీ, అత్యంత నాణ్యమైన విడిభాగాలతో రూపొందించిన ఎక్స్ 3 మోడల్స్ కస్టమర్లకు అన్నివిధాలా నచ్చుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అమ్మకాలు పెంచుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రపంచమంతా పాటిస్తున్న ప్రణాళికలే ఇక్కడా అమలు చేస్తాం. భారత్ మార్కెట్లో తెలుగు రాష్ట్రాలు మాకు కీలకమని చెప్పగలను. హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో మాకు షోరూమ్లు ఉన్నాయి. ఇటీవల గుంటూరులో మేము ప్రారంభించిన మొబైల్ స్టూడియోలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 50 నగరాలను మొబైల్ స్టూడియోలు కవర్ చేశాయి. వారంలో మూడునాలుగు రోజుల పాటు మొబైల్ స్టూడియోల ద్వారా సేవలు అందిస్తున్నాం. కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్తో పాటు ఇతర సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు బ్రాండ్ ఎక్స్ పీరియన్స్ అందించాలన్న ఆలోచనతో వీటిని ఏర్పాటు చేశాం. మొబైల్ స్టూడియోలకు అపూర్వ స్పందన వస్తోంది. మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరిస్తాం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement