వివాద్‌ సే విశ్వాస్‌ను ఆకర్షణీయంగా మార్చాలి

1 Mar, 2023 04:37 IST|Sakshi

ప్రభుత్వానికి ఎంఎస్‌ఎంఈల వినతి

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో భాగంగా ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్‌మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్‌ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్‌లైన్‌లో ఉండాలని డిమాండ్‌ చేశాయి. బడ్జెట్‌ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్‌ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎంఎస్‌ఎంఈలకు వివాద్‌సే విశ్వాస్‌ పథకాన్ని ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు