నేడు ఆకాశంలో అద్భుతం..ఇలా చూసేయండి..!

12 Jul, 2021 19:05 IST|Sakshi

బెంగళూరు: గతంలో  గురు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గ్రేట్‌ కంజక్షన్‌ భూమిపై ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంది. కాగా ఈసారి ఆకాశంలో నేడు మరో అద్బుత దృశ్యం ఆవిష్కృతంకానుంది.  అంగారక,  శుక్ర గ్రహాలు  ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చంద్రుడితో కలిసి కనిపించనున్నాయి. భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడవచ్చును. ఖగోళ పరిశోధకుల ప్రకారం.. శుక్ర గ్రహం, మార్స్ దగ్గరగా రావడం మొదటిసారి. అంగారక గ్రహం (మార్స్), శుక్ర (వీనస్) గ్రహాలు ఫిబ్రవరి 12, 2022, మార్చి 12, 2022 న మరోసారి దగ్గరగా రానున్నాయి.


జూలై 12 , 13 తేదీలలో అంగారక గ్రహం, శుక్రుడు భూమి నుంచి ఒకదానికొకటి కేవలం 0.5 డిగ్రీల తేడాతో కనిపిస్తారు.  జూలై 12 న రెండు గ్రహాలతో 4 డిగ్రీల కోణంలో చంద్రుడు సమాంతరంగా రానున్నాడు. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం ఈ ఖగోళ ఈవెంట్‌ను నేరుగా  కంటితో చూడవచ్చునని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సూర్యాస్తమయం తరువాత  భారత్‌లో ఎక్కడైనా నేరుగా చూడవచ్చును.

మరిన్ని వార్తలు