petrol and diesel price: మరోసారి పెరిగిన పెట్రో ధరలు..ఎంతంటే?

1 Oct, 2021 09:35 IST|Sakshi

శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను కేంద్రం భారీగా 62 శాతం పెంచింది. సహజ వాయువు ధరలు పెరగడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకోవడంతో  దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 

దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధరపై 25 పైసలు పెరిగి  రూ.101.89కి చేరింది, డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగి రూ.89.87 ఉంది

► ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా డీజిల్ ధర రూ. 97.84 ఉంది

► హైదరాబాద్లో లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.106కి చేరింది, లీటర్‌ డీజిల్ ధర 33 పైసలు పెరిగి రూ.99.08 ఉంది

► విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.1.06కి పెరిగి రూ.108.67కి చేరింది, లీటర్‌ డీజిల్ ధర రూ.1.06 పెరిగి  రూ.100.39కు ఉంది

► వైజాగ్‌లో  లీటర్‌ పెట్రోల్ ధరపై 0.82పైసలు పెరిగి రూ.107.51కు చేరింది. లీటర్‌ డీజిల్ ధర రూ.99.28 ఉంది.

మరిన్ని వార్తలు