సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు

29 Nov, 2023 16:13 IST|Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. రెండు నెలల తర్వాత తొలిసారి గ్లోబుల్‌ మార్కెట్‌లో సానుకూల సంకేతాలతో మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. 

బుధవారం మార్కెట్‌లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 727 భారీ లాభంతో 66,901.91 వద్ద నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 20,096 వద్ద ముగిశాయి. 

హీరో మోటోకార్పొ,ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, టాటా మోటార్స్‌ లాభాల్లో ముగియగా.. ఓఎన్‌జీసీ, నెస్లే ఇండియా, ఎథేర్‌ మోటార్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలతో ముగింపు పలికాయి.    

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు