న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ ఆర్థిక సంవత్సరం మూడవ విడత డిసెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 12–16 తేదీల్లో నాల్గవ విడత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మొదటి విడత జూన్ 19 నుంచి 23 వరకూ (బాండ్ జారీ ధర గ్రాముకు రూ.5,926), రెండవ విడత సెపె్టంబర్ 11 నుంచి 15 వరకూ (ధర గ్రాముకు రూ.5,923) అమలయిన సంగతి తెలిసిందే.