బంగారం ధరల్లో కాస్త ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడడం లేదు.ఎందుకంటే బంగారం ఎప్పుడు బంగారమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్ల కోసం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. సావరిన్ బంగారు బాండ్ నాలుగో దశ సబ్స్రిప్షన్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకంలో భాగంగా గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను ఒక గ్రాముకు రూ. 4,807గా నిర్ణయించింది.
ఆన్లైన్లో కొనుగోలు చేస్తే గ్రాముకి రూ. 50 రూపాయల తగ్గింపు రానుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ -2021-22 నాలుగో దశ సబ్స్క్రిప్షన్ జూలై 16తో ముగియనుంది. గోల్డ్ బాండ్లపై ఇన్వెస్టర్లకు 2.5 శాతం వార్షిక వడ్డీరేటును అందించనుంది. బాండ్లపై వచ్చే మెచ్చూరిటీ తరువాత వచ్చే లాభాలపై ఏలాంటి పన్ను ఉండదు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015 నుంచి సుమారు రూ. 25 వేల కోట్లను రాబట్టింది.
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ముఖ్యమైన విషయాలు..