ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి ఎమ్ఐ 11 లైట్ను ఈ ఏడాది జూన్ 22న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా షావోమీ 11 లైట్ సిరీస్లో భాగంగా మరో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. న్యూ షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ఫోన్ను ఈ నెల 15న లాంచ్ చేస్తున్నట్లు షావోమీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ ఎమ్ఐ లైట్ 11తో సమానమైన స్పెసిఫికేషన్స్తో పనిచేస్తోందనే ఊహగానాలు వస్తున్నాయి.
చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..!
షావోమీ తన అధికారిక వెబ్సైట్లో షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ఫోన్తో పాటుగా షావోమీ 11టీ, షావోమీ 11 టీ ప్రో స్మార్ట్ఫోన్లను టీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో షావోమీ 11 లైట్ 5జీఎన్ఈ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ధర సుమారు రూ. 28,600గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
షావోమీ 11 లైట్ 5జీఎన్ఈ స్పెసిఫికేషన్లు అంచనా..
Something new is right around the corner. ❄️
Get ready for the special date!
2021.9.15|20:00 GMT+8 #XiaomiProductLaunch #Xiaomi11LiteSeries pic.twitter.com/ekjLXo4RJL
— Xiaomi (@Xiaomi) September 11, 2021
చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!