టీడీపీ కార్యాలయంలో లైంగిక దాడి నిందితుడు

25 Nov, 2023 03:34 IST|Sakshi

గుంటూరులో పోలీసులపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం

పట్నం బజారు (గుంటూరు), పెదకాకాని: ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యా­లయంలోకి చొరబడ్డాడు. నిందితుడిని అదు­పు­లోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పో­లీసు­లపై శుక్ర­వారం గుంటూరులో టీడీపీ కార్యకర్తలు దాడికి తెగ­బడ్డారు. కానిస్టేబుళ్లను నిర్బంధించే యత్నం చేశారు.

సీఐ స్థాయి అధికారి వారిస్తున్నా వినకుండా బరి తెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం గుంటూరు స్వర్ణభార­తీ­నగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ నేత చల్లా లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లి పేరుతో వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు నాగార్జున వర్సిటీలో చదివిన సమయంలో అక్క­డ కాంట్రాక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ పరిచ­యం పెంచుకుని శారీరకంగా లొంగ­దీసు­కున్నాడు.

అప్పటికే అతడికి వివాహం అయిందని తెలియడంతో నిలదీసిన బాధితు­రాలిని నగ్న వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరించి పలుమార్లు అఘాయి­త్యానికి ఒడిగ­ట్టాడు. అనంతరం పెళ్లి చేసుకున్న బాధి­తురాలి భర్తను కూడా బెదిరించి వారి కాపురా­న్ని విచ్ఛిన్నం చేశాడు. తన కుమార్తె జీవితం అన్యా­యమైందనే బాధతో బాధితురాలి తండ్రి ఈ ఏడాది ఆగస్టులో గుండెపోటుతో మరణించాడు. దీంతో నింది­తుడు లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  

టీడీపీ కార్యాలయంలో నక్కిన నిందితుడు: సాంకే­తి­క పరిజ్ఞానం ఆధారంగా నిందితుడి లైవ్‌ లొకేషన్‌ను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇర్ఫాన్, మణి­ప్రసాద్‌ అతడి కారును వెంబడిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకు­న్నారు.

పోలీసులను గుర్తించిన టీడీపీ నేత­లు, కార్య­కర్త­లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ సమక్షంలోనే దాడికి యత్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారు. అనంతరం సీఐ సురేష్‌బాబు అక్క­డకు చేరుకోవడంతో నిందితుడు చల్లా లక్ష్మీనారాయణ ఇక్కడ లేడంటూ బుకాయించారు. అయితే లక్ష్మీనారాయణను టీడీపీ కార్యాలయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మెల్లగా జారుకున్నారు. 

మరిన్ని వార్తలు