ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు

3 Mar, 2022 12:20 IST|Sakshi

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్‌​, నవీన్‌తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్‌గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్‌మెన్‌గా, నవీన్ శ్రీనివాస్‌రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు.   

మరిన్ని వార్తలు