పల్నాడు జిల్లా: వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

24 Oct, 2023 07:39 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: జంగమహేశ్వరం గ్రామంలో దారుణం జరిగింది. బరితెగించిన టీడీపీ నాయకులు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త  కునిరెడ్డి కృష్ణారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయనను టీడీపీ నేతలు గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపారు.

జంగమహేశ్వపురం వైఎస్సార్‌సీపీ పార్టీలో కృష్ణారెడ్డి యాక్టివ్గా పనిచేస్తున్నారు. కృష్ణారెడ్డి హత్య నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హంతకుల కోసం మూడు స్పెషల్‌ టీంలను పోలీసులు రంగంలోకి దింపారు.

మరిన్ని వార్తలు