మొబైల్ వినియోగం ద్వారా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య క్రమేపీ పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. మానసిక సంబంధ సమస్యలతో బాధపడే ప్రతి పది మందిలో నలుగురైదుగురు 25 ఏళ్ల లోపు వారే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోందని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిని లోతుగా పరిశీలిస్తే సెల్ఫోన్ వ్యసనమే కారణమని తేలుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనాభా 51 లక్షల పై మాటే. ఈ జనాభా ఆధారంగా మొబైల్ విచ్చలవిడి వినియోగంలో 20 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న వారిలో అత్యధికంగా 60 శాతం ఉంటున్నారని అంచనా.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొబైల్ ఫోన్ ప్రభావిత యువత
వయసు ఎంత మంది నిరంతర
వీక్షకుల శాతం
18 1,13,184 60
19 91,775 55
20 1,31,406 65
21 84,246 60
22 98,661 65
23 85,392 70
24 90,638 65
25 1,38,861 75