కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 10 మంది మృతి

15 May, 2022 08:23 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూయార్క్ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ  కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైనికుడి వేషధారణలో సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నల్లజాతీయులు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు.

చదవండి: (ప్రపంచ సంక్షోభమే.. జి–7 దేశాల ఆందోళన) 

మరిన్ని వార్తలు