అందరం యుద్ధం చేయాల్సిందే..

19 Nov, 2023 00:16 IST|Sakshi
మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కన నాయకులు

ఆత్మీయ

సమ్మేళనంలో

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సత్తుపల్లి/పెనుబల్లి: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్న నేపథ్యాన కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు చెబుతారనే నమ్మకముందని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి, కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కోచైర్మన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున అందరం సమష్టిగా యుద్ధం చేయాల్సిన అవసరముందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా కష్టపడితే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకోవడం సులువవుతుందని చెప్పారు. ధనబలం ముందు ప్రజాబలమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ గాలి వీస్తున్నందున సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు చైతన్యంతో తీర్పు చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరు గ్యారంటీలను గడపగడపకు తీసుకెళ్లి అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. అనంతరం ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడగా సత్తుపల్లి అభ్యర్ధి మట్టా రామగయి, నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్‌, మువ్వా విజయబాబు, తోట సుజలరాణి, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, నున్నా రామకృష్ణ, సీతారామారావు, ఉడతనేని అప్పారావు, దండు ఆదినారాయణ, బొంతు శ్రీనివాసరావు, ఎస్‌కె మౌలాలీ, చల్లారి వెంకటేశ్వరరావు, గాదె చెన్నారావు, మున్వర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు